Saturday, April 20, 2024

రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ దుర్మరణం

మదనపల్లె : (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) : ట్రాక్టర్ – ఆటో ఢీకొన్న ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ దుర్మరణం పాలైన ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో శనివారం తెల్లవారుజామున జరిగింది. సిఆర్పిఎఫ్ మహిళా కానిస్టేబుల్ అరుణాదేవి (41)  కుమారున్ని అత్తగారింటిలో వదిలి వెళ్ళడానికి ఆర్ సి వడ్డీపల్లికి వచ్చింది. వదిలిపెట్టిన తరువాత తిరిగి విధులకు అదే ఆటోలో మదనపల్లికి వెళ్లే క్రమంలో ఆరోగ్యవరం తురకపల్లి వద్ద, ట్రాక్టర్ ఆటోను ఢీకొన్న ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ అదే ఆటోలో ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించగా.. ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతిచెందింది. అరుణాదేవి  మరణంతో మదనపల్లి రాయుని చెరువు వడ్డీపల్లిలో విషాదఛాయలు ఆలుముకున్నాయి. మదనపల్లె రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement