Thursday, April 25, 2024

TTD NEWS : ఆన్‌లైన్‌లో లడ్డూలు బుక్ చేసుకోవచ్చని అవాస్తవ ప్రచారం.. భక్తులు నమ్మవద్దు..

తిరుమల : టీటీడీ వెబ్ సైట్ ద్వారా లడ్డూలు ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. టీటీడీ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో భక్తులు దర్శన టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే పరిమితంగా అదనపు లడ్డూలు బుక్ చేసుకునే అవకాశం ఉంది. అంతే కానీ దర్శనంతో సంబంధం లేకుండా లడ్డూలు టీటీడీ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని భక్తులు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement