Thursday, April 18, 2024

పునరావాస కేంద్రాలలో ఆహారం, దుప్పట్లు పంపిణీ..

తిరుపతి సిటీ, (ప్రభ న్యూస్) : మాండోస్ తుఫాన్ బాధితులకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సాయం చేశారు. వరదల కారణంగా ముంపునకు గురైన వారికి ఆహార పంపిణీతో పాటు దుప్పట్లు అంద‌జేశారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ జై భీమ్ నగర్ , కెనడి నగర్ పునరవ కేంద్రానికి చేరుకుని బాధితులకు అన్నదానం, దుప్పట్లు అంద‌జేశామ‌న్నారు. తిరుపతి నగరంలో వరదల వల్ల ఎలాంటి నష్టం జరగకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్న‌ట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement