Thursday, April 18, 2024

టిడిపి ప్ర‌చార నేత‌ల‌కు క‌రోనా – చంద్ర‌బాబుకి కొత్త టెన్ష‌న్..

తిరుపతి: తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న టిడిపి గెలుపుకోసం స‌ర్వ‌శ‌క్తుల‌ను ఒడ్డుతున్న‌ది… చంద్ర‌బాబుతో పాటు టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియ‌ర్ నేత‌లు ప్ర‌చారంలో పాల్గొంటున్నారు.. టిడిపి అధినేత‌తో క‌ల‌సి కొంత‌మంది ప్రచారాన్ని కొన‌సాగిస్తున్నారు.. ఈ నేప‌థ్యంలో ప్ర‌చార నేత‌ల‌లో కొంద‌రు కరోనా భారీన ప‌డ‌టంతో టిడిపిలో కొత్త భ‌యం ఏర్ప‌డింది.. ప్ర‌చారంలో పాల్గొన్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవి, మాజీ మంత్రులు జవహర్, వంగలపూడి అనిత, ఎమ్మెల్సీ సంధ్యారాణిలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణైంది.. అనిత‌, సంధ్యారాణిలు చంద్ర‌బాబుతో పాటు ఇటీవ‌లే తిరుమ‌ల ద‌ర్శ‌నానికి వెళ్లారు.. అలాగే ఆయ‌న‌తో క‌ల‌సి రోడ్ షోలో కూడా పాల్గొన్నారు…దీంతో చంద్ర‌బాబుతో పాటు ఇత‌ర నేత‌ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.. క‌రోనా పాజిటివ్ గా తేలిన నేత‌లు చికిత్స కోసం తిరుప‌తి నుంచి హైద‌రాబాద్ కు ప‌య‌న‌మ‌య్యారు.. ‌

Advertisement

తాజా వార్తలు

Advertisement