Thursday, March 28, 2024

జగన్ కు ప్రచార కార్యదర్శి గా సోము – బుద్దా వెంకన్న

తిరుపతి ప్రెస్ క్లబ్ – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికలలో జరుగుతున్న ప్రచారంలో లో వైయస్సార్ సిపి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ప్రచార కార్యదర్శి గా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ అభ్యర్థినికి ఓటు వేయమని అడిగిన దాఖలాలు ఎక్కడా కనపడలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఉప ఎన్నికల ప్రచారంలో ఎక్కడ జగన్మోహన్రెడ్డిని విమర్శించడం , ఆరోపించడం కానీ లేదని, ఎంతసేపు తమ నాయకుడు చంద్రబాబుపై విమర్శలు విసురుతున్నారనీ ఆరోపించారు. తమ అభ్యర్థిని గెలుపు కోసం ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు లేదని, జగన్మోహన్ రెడ్డి నీ గెలిపించడంకోసం తమ ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఉన్నదని ఛలోక్తి విసిరారు. ఏది ఏమైనా నా నగరం లో ఉప ఎన్నికలు నిజాయితీగా జరిగితే తమ పార్టీ గెలవడం ఖాయమని సంతోషం వ్యక్తం చేశారు. జగన్ ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో నవరత్నాల కు బదులు కొత్తగా మూడు రత్నాలు ఉపయోగిస్తున్నారని, అవి డబ్బు అధికారం, పోలీస్ యంత్రాంగం అని పేర్కొన్నారు. ఇటువంటి మంత్రాలను ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని, తమ పార్టీకి దిశానిర్దేశం అయిన చంద్రబాబును అభిమానిస్తున్న ట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న గుండాయిజం ఎన్నికలను తిప్పికొట్టేందుకు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలను నాయకుడు చంద్రబాబు బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎప్పుడూ తమ పార్టీ వైపే ఉన్నారని, జగన్ తన మూడు మంత్రాలను దూరం పెడితే తమ నాయకుడు చంద్రబాబు కు గెలుపును బహుమతిగా ఇచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైయస్సార్ సిపి పార్టీ నిజాయితీగా ఉప ఎన్నికల్లో పాల్గొని, తమ పార్లమెంట్ అభ్యర్థినీ గెలిపించుకోవాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement