Wednesday, April 24, 2024

గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యం

తలకోన జలపాతంలో గల్లంతైన విద్యార్థి మృతదేహం లభ్యమైంది. తిరుపతికి చెందిన వెంకట మోహన్ (20) జనవరి 1న మిత్రులతో కలిసి తలకోనకు వెళ్లాడు. నీటిమడుగులో మునిగిన విద్యార్థి గల్లంతు కావడంతో ఎర్ర వారి పాలెం పోలీస్ స్టేషన్‌లో సహ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement