Saturday, April 20, 2024

Blast – ట‌పాసుల గోడౌన్ లో పేలుడు … ముగ్గురు దుర్మ‌ర‌ణం

తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వరదయ్యపాళెం మండలంలోని యల్లకట్టనలో ఉన్న టపాసుల గోదాంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురు మృతిచెందారు. పేలుడు అనంత‌రం అక్క‌డ భారీగా మంటలు ఎగసిపడ్డాయి.. ఫైర్ సిబ్బంది అక్క‌డి చేరుకుని మంట‌లు ఆర్పుతున్నారు.. అలాగే స‌హాయ కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి.. గోడౌన్ లో మ‌రికొంత మంది ఉండ‌వ‌చ్చ‌ని అనుమానిస్తున్నారు.. దీనిపై మ‌రిన్నివివ‌రాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement