Wednesday, April 24, 2024

వైసిపి అక్ర‌మాల‌ను ఎదుర్కొనే స‌త్తా ఒక్క బిజెపికే ఉంది – కె ల‌క్ష్మ‌ణ్…

తిరుప‌తి – ఎపిలో వైసిపి చేస్తున్న అక్ర‌మాల‌ను, దౌర్జ‌న్యాల‌ను ఎదుర్కొనే స‌త్తా ఒక్క బిజెపికే ఉంద‌ని అన్నారు తెలంగాణ బిజెపి సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే కె ల‌క్ష్మ‌ణ్. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌లో ఆయ‌న బిజెపి అభ్య‌ర్ధి ర‌త్న‌ప్ర‌భ త‌రుపున నేడు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.. ఆ త‌ర్వాత ఆయ‌న మీడియాతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతూ, బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్ర ప్రజల భవిష్యత్ తో ముడిపడి ఉందని అన్నారు. సీఎం రెండేళ్ల పాలనతో ప్రజలు విసిగిపోయారని, అవినీతి, దోపిడీ, పెత్తందారీ వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చేశారని తెలిపారు. హిందువుల మనోభావాలు గాయపడేలా తిరుమలలో అన్యమత ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక మాఫియా, భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని లక్ష్మణ్ మండిపడ్డారు. భూ ఆక్రమణలు, ఇసుక మాఫియా ద్వారా వచ్చిన డబ్బును ఎన్నికల్లో ఓట్లు కొనేందుకు ఉపయోగిస్తున్నారని విమర్శించారు. ఎన్నిక‌ల‌లో చంద్రబాబు అస్త్రసన్యాసం చేసారని, భవిష్యత్తులో ఆ పార్టీ మనుగడ ప్రశ్నర్ధకంగా మారిందని అన్నారు. సబ్ కా సాత్ , సబ్ కా వికాస్ నినాదంతో ప్రధాని మోడీ దేశాభి వృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ఎంపీగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభను గెలిపిస్తే మోడీ ప్రతినిధిగా రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement