Wednesday, April 24, 2024

హోదా ఇస్తామ‌ని మోసం చేసిన పార్టీకి ఓట్లెందుకు వేయాలి – ఎమ్మెల్యే భూమ‌న‌

తిరుపతి: విభజనతో అన్యాయానికి గురైన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చి.. పచ్చిద్రోహం చేసిన వారికి ఓట్లు ఎందుకు వేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి బహిరంగలో వెంకటేశ్వరస్వామి పాదాల సాక్షిగా నరేంద్రమోడీ ప్రత్యేక హోదా ఇస్తాన‌ని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని తుంగ‌లో తొక్కిన పార్టీకి ఓట్లు అడిగే హ‌క్కులేద‌న్నారు.. ఇక సోము వీర్రాజును కౌంట‌ర్ చేస్తూ, రత్నప్రభను గెలిపిస్తే కేంద్రమంత్రిని చేసే స్థాయి సోము వీర్రాజుకు ఉందా..? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిస్తే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామనడం లోకేష్‌ రాజకీయ పరిజ్ఞానలేమికి నిదర్శనమని చురకంటించారు. పెట్రోల్‌ ధరలను కేంద్రం పెంచినప్పుడు చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఓటమి భయంతో ఎన్నికలు నిలిపివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement