Thursday, April 25, 2024

మే 31 నుండి అప్పలాయగుంట ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

తిరుపతి : అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 31 నుండి జూన్ 8వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం మే 23వ తేదీ మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, మే 30వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు. వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.
31-05-2023 ధ్వజారోహణం -పెద్దశేష వాహనం
01-06-2023 చిన్నశేష వాహనం హంస వాహనం
02-06-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
03-06-2023 కల్పవృక్ష వాహనం కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం
04-06-2023 మోహినీ అవతారం గరుడ వాహనం
05-06-2023 హనుమంత వాహనం గజ వాహనం
06-06-2023 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
07-06-2023 రథోత్సవం అశ్వవాహనం
08-06-2023 చక్రస్నానం ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 3వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement