Thursday, April 25, 2024

జీవితంపై విరక్తితో వ్య‌క్తి ఆత్మహత్య

తిరుపతి సిటీ : జీవితంపై విరక్తి చెంది యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్ప‌డిన ఘ‌ట‌న అన్నమయ్య జిల్లా గాలివీడులో చోటుచేసుకుంది. హరిజనవాడకు చెందిన లేట్ లక్ష్మీనారాయణ కుమారుడు ఆంజనేయులు (26) కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం ఇతనికి పెళ్లి అయింది. భార్యాభర్తలు విడిపోయారు. ఆ తర్వాత మూడు సంవత్సరాల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ భార్యతో కూడా ఘర్షణ పడి దూరంగా ఉండి జీవనం సాగిస్తున్నాడు. తిరుపతి నగరంలో అతని స్నేహితుడితో మాట్లాడి నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కు వాన్ మెన్ గా చేరాడు. ఇంటి పనులు జరుగుతున్న ప్రాంతంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న‌ ఎంఆర్ పల్లి ఎస్ఐ. వినోద్ కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎస్వి మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement