Friday, April 26, 2024

బస్సును ఢీ కొన్న బైక్ … ఇద్దరి దుర్మరణం 

చంద్రగిరి (రాయలసీమ ప్రభ వెబ్ న్యూస్) : తిరుపతి జిల్లాలోని భాకరా పేట ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సును మోటార్ బైక్ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. అన్నమయ్య జిల్లా భాకరాపేట పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ప్రశాంత్ నగర్ లో ఉంటున్న శివకుమార్ (22) సంక్రాంతి పండుగకు సొంతఊరైన పీలేరు మండలంలోని నూతన కాలువకు వచ్చాడు.

తిరుపతి నగరం సత్యనారాయణ పురంలో ఉంటున్న సాయికృష్ణ (22), హేమంత్ (20) అనే ఇద్దరు మిత్రులు అదే గ్రామానికి వెళ్లారు. ముగ్గురు కలిసి ఒకే బైక్ పైన తిరుపతికి వస్తూ బస్సును ఢీకొన్నారు. ఫలితంగా సాయికృష్ణ, హేమంత్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. శివకుమార్ తీవ్రగాయాలతో తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు భాకరాపేట పోలీసులు తెలిపారు. ముగ్గురు అతి వేగాన్ని నియంత్రించలేక పోవడంతోనే ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణీకులు చెబుతుండటం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement