Wednesday, April 24, 2024

13 మంది దారి దోపిడీ దొంగల అరెస్ట్… రూ.11 లక్షల నగదు స్వాధీనం…

చిత్తూరు : 13 మంది దారి దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి రూ.11 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేర‌కు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. గంగాధర్ నెల్లూరు నెల్లేపల్లి క్రాస్ వద్ద ఈనెల 1వ తేదీన నగదుతో జాన్సన్ అనే వ్యక్తి కారులో ప్రయాణిస్తుండగా.. కారును అడ్డగించి అతనిపై రాడ్లతో , కొయ్యలతో దాడి చేసి నగదు ఎత్తుకెళ్లారు. ఈ కేసు ద‌ర్యాప్తులో భాగంగా గురువారం 13 మంది దారి దోపిడీ దొంగలను జిల్లా ఎస్పీ అరెస్టు చూపించారు. పరారీలో ఉన్న మరో కొంతమందిని త్వరలో పట్టకుంటామని ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement