Wednesday, April 24, 2024

తిరుపతి బరిలో అఖిల పక్షం అభ్యర్ధి – ప్రతిపాదించిన గంటా..

తిరుపతి: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్య‌మం కొనసాగుతున్న నేప‌థ్యంలో తిరుపతి ఉపఎన్నికల్లో ఉద్యమం తరపున అఖిల‌ప‌క్షం అభ్య‌ర్ధి బ‌రిలో ఉంటే బాగుంటుంద‌ని టిడిపి నేత , విశాఖ‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు అన్నారు.. తిరుప‌తిలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఉద్యమానికి శ్రీవారి ఆశీస్సులు కోసం వచ్చామని తెలిపారు. అఖిల ప‌క్షం అభ్య‌ర్ధి విష‌యంలో తాను అన్ని పార్టీల‌త‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతాన‌ని చెప్పారు. టీడీపీ, జనసేన, వామపక్షాలు అన్నీ విశాఖ ఉక్కు కోసం నిలబడ్డాయని చెప్పారు. అలాగే అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. అలాగే విశాఖ ఉద్యమంలో పవన్ కల్యాణ్ నేరుగా పాల్గొంటే ప్రభావం ఎక్కువ ఉంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement