Thursday, March 28, 2024

Chiranjeevi: సీఎం జ‌గ‌న్ ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా వచ్చా

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ను మెగాస్టార్ చిరంజీవి కలిశారు. సీఎంతో లంచ్ మీటింగ్ సందర్భంగా పలు అంశంపై చర్చిస్తున్నారు. ప్రధానంగా సినిమా టికెట్ల వివాదానికి సంబంధించిన అంశంపైనే చర్చలు జరుగుతున్నాయి.   హైదరాబాద్ నుంచి నేరుగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్.. ఎయిర్ పోర్ట్ వ‌ద్ద‌ మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం జ‌గ‌న్ ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా వచ్చాన‌ని చిరంజీవి అన్నారు. సీఎంతో అన్ని విషయాలపై చర్చిస్తాన‌ని చిరంజీవి తెలిపారు. జ‌గ‌న్ తో లంచ్ చేసి, అనంత‌రం చ‌ర్చించి మరో గంటన్నరలో అన్ని అంశాలపై క్లారిటీ ఇస్తాన‌ని చెప్పారు.

అనంత‌రం ఆయ‌న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి జ‌గ‌న్ నివాసం వద్దకు వెళ్లి జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధ‌ర‌లు, ఇండస్ట్రీ సమస్యలపై చ‌ర్చించ‌డానికే సీఎం జ‌గ‌న్‌తో చిరంజీవి స‌మావేశం అవుతున్నారు. టికెట్ల ధరలు పెంచకుండా ఉంటే జరిగే నష్టాన్ని మెగాస్టార్ వివరించనున్నట్లు సమాచారం. సినిమా టికెట్ల వివాదం ముదురుతున్న కారణంగా ఈ మేరకు చిరంజీవి జగన్‌తో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement