Wednesday, April 17, 2024

నిఖార్సైన రాజకీయ నాయకుడంటే చిరంజీవే.. పేర్ని నాని

నిఖార్సైన రాజకీయ నాయకుడంటే చిరంజీవేనని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… వారాంతపు ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ భ్రమల్లో ఉన్నారన్నారు. చిరంజీవి రాజకీయంగా చాలా తప్పులు చేసినట్లు పవన్ మాట్లాడుతున్నారన్నారు. తాను మాత్రం చాలా పునీతుడిని అన్నట్లు పవన్ మాటలున్నాయన్నారు. ప్రజారాజ్యం ఓడిపోగానే యువరాజ్యం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపించలేదన్నారు. చిరంజీవి పార్టీ పెట్టారు.. పోరాటం చేశారు.. గెలిచారన్నారు.. రాజకీయాలు వద్దనుకుని కాంగ్రెస్ లో విలీనం చేశారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement