Saturday, April 20, 2024

Chill beer – బీరు వ్యాను బోల్తా – క్షణాలలో 200 కేసుల మాయం చేసిన జనం

అనకాపల్లి – బీరు బాటిళ్లలోడు వెళ్తుండగా వ్యాను బోల్తా పడటంతో ఒక్కసారిగా జనం ఎగబడ్డారు. దొరికిందే ఛాన్స్ అనీ చేతికి అందినన్నీ బాటిళ్లు తీసుకెళ్లారు.

ఆంధ్ర ప్రదేశ్ అనకాపల్లి కసింకోట రోడ్డులో బయ్యవరం జాతీయ రహదారిపై బీర్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా. పడింది. దీంతో 200 కేసుల బీర్ బాటిల్స్ నేలపాలు. అయ్యాయి. అసలే ఎండలు ఆపై చల్లని బీరు..ఎవరు మాత్రం ఆగగలరు అన్నట్లుగా బీరుబాటిళ్లు తీసుకుని పరుగులు పెట్టారు. ప్రమాదంలో కొన్ని బాటిళ్లు పగిలిపోగా..కొన్ని అట్టాపెట్టెల్లో అలాగే పడిపోయాయి. పగిలిన బాటిళ్లుతప్ప అట్టాపెట్టెల్లోని బీరు బాటిళ్లు అన్నీ జనం తీసుకెళ్లారు . రోడ్డుపై వేగంగా వెళ్తున్న వ్యాన్ టర్న్ తీసుకోవడంతో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బీరు బాటిళ్లు ద్వంసమయ్యాయి…

Advertisement

తాజా వార్తలు

Advertisement