Friday, April 19, 2024

Killer Lady: పిల్లలున్నా లవరే కావాలంది.. క‌ట్టుకున్న మొగుడిని ఖ‌తం చేసింది..

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చి ఆపై డెడ్ బాడీని కాలువలో పడేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా పొన్నూరులో జరిగింది. తాడేపల్లి మండలం సీతానగరానికి చెందిన జలపత్రి నాగరాజుకు.. బిట్రగుంట ప్రాంతానికి చెందిన సోనీకి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆరేళ్లుగా పొన్నూరులో నివాసముంటున్నారు. సోనీ ప్రవర్తనపై అనుమానం రావడంతో కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య వివాదం నడుస్తోంది.

ఈ క్రమంలోనే.. ఈనెల 7న భార్య సోనీ ఆమె ప్రియుడు సహా మరి కొంతమంది కలిసి నాగరాజును ఇంట్లోనే చంపేశారు. అదేరోజు రాత్రి నాగరాజు డెడ్ బాడీని బాపట్ల కాలువలో పడేశారు. 9వ తేదీన నాగరాజు తోడల్లుడు.. మృతుడి మేనల్లుడికి ఫోన్ చేసి జరిగిందంతా తెలిపాడు. నాగరాజు మేనల్లుడు ఏడుకొండలు.. ఇంటికి వచ్చి పరిశీలించగా ఇంట్లో రక్తం మరకలు కనబడ్డాయి. సోనీపై అనుమానం వచ్చి ఏడుకొండలు పోలీసులకు కంప్లెయింట్ చేశాడు. పొన్నూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి.. సోనీని, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని తమదైన రీతిలో విచారణ చేపట్టారు. కాగా, బుధవారం బాపట్ల కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారు. ఆ మృతదేహం నాగరాజుదేనని గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement