Thursday, April 25, 2024

తీరానికి కొట్టుకొచ్చిన రథం, చూసేందుకు ఎగ‌బ‌డుతున్న జ‌నం

సంతబొమ్మాళి (ప్ర‌భ న్యూస్‌) అసని తుపాను ప్రభావం కోస్తాంధ్ర‌పై తీవ్రంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోనూ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులు తీరప్రాంతలో ఎక్కువగా ఉన్నాయి. అయితే.. స‌ముద్రంలో అల‌ల‌పోటు మాత్రం ఎక్కువ‌గానే ఉంది. దీంతో ఎం సంన్నాపల్లి తీరానికి రథ‌, మందిరం ఆక్రుతిలో ఉన్న శకలాలు కొట్టుకొచ్చాయి. ఒడిశా ప్రాంతంలో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయ‌ని, తుపాను ప్ర‌భావంతో అక్క‌డి నుంచి కొట్టుకుని వ‌చ్చి ఉంటుంద‌ని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. దీన్ని చూడ్డానికి జ‌నం పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement