Thursday, April 25, 2024

Big Breaking | చంద్రబాబు సభలో అపశృతి.. తొక్కిసలాటలో 8 మంది మృతి.. మరో ఐగురికి సీరియస్​

‘‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’’ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. కందుకూరు సభా ప్రాంగణంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికి ఎనిమిది మంది కార్యకర్తలు చనిపోయారు. పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

ఈ తొక్కిసలాటలో చాలామంది ఒక్కసారిగా కాల్వలో పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మొదటి ఇద్దరు చనిపోయారు. ఆ తర్వాత మరో ఆరుగురు మృతిచెందినట్టు సమాచారం అందుతోంది. కాగా, బాధితులను చంద్రబాబు హాస్పిటల్​కి వెళ్లి పరామర్శించారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఒక్కో ఫ్యామిలీకి పది లక్షల చొప్పున ఎక్స్​గ్రేషియా అందివ్వనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు.

సభకు పక్కనే కాల్వ ఉండడం.. ఈ క్రమంలో సభకోసం వస్తుండగా తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. దీంతో చాలామంది కార్యకర్తలు కాల్వలో పడిపోయినట్టు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

updates are continuous.. follow our website https://www.prabhanews.com/

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement