Friday, April 19, 2024

6 నుంచి రాయలసీమలో చంద్రబాబు పర్యటన..

అమరావతి, ఆంధ్రప్రభ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాయలసీమ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జూలై 6 నుంచి 8 తేది వరకు రాయలసీమలో పర్యటిస్తారు. జూలై 6వ తేదీన మదనపల్లిలో నిర్వహించనున్న జిల్లా మహానాడులో పాల్గొని, ఆ తరువాత నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

అలాగే జూలై 7న పీలేరులో అన్నమయ్య జిల్లా 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష నిర్వహిస్తారు. జులై 8న నగరి, జీడీ నెల్లూరు నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు. ఆ తరువాత రోడ్‌ షోలో ప్రసంగిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement