మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు సర్పంచ్ లతో భేటీ కానున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థలను ఈ ప్రభుత్వం నీరుగారుస్తుందని, నిధులు, విధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. నిధులు లేక, గ్రామాల్లో అభివృద్ధి చేయలేక పంచాయతీ సర్పంచ్ లు ఇబ్బంది పడుతున్నారు. ఈసమావేశంలో వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి చంద్రబాబు కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. పార్టీకి చెందిన సర్పంచ్ లు ఈ సమావేశానికి హాజరు కావాలని పార్టీ నుంచి పిలుపు అందడంతో ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
- Advertisement -
#AndhraPrabha #AndhraPrabhaDigital