Sunday, March 24, 2024

ఏపీ గ‌వ‌ర్న‌ర్ కు చంద్ర‌బాబు లేఖ

మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ కు లేఖ రాశారు. గుడివాడ క్యాసినోపై విచార‌ణ జ‌ర‌పాల‌ని లేఖ‌లో కోరారు. మంత్రి వ‌ర్గం నుంచి కొడాలి నాని ని బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని కోరారు. గుడివాడ‌లో క్యాసినో, జూదం నిర్వ‌హించార‌న్నారు. గుడివాడ వెళ్లిన టీడీపీ నేత‌ల కార్ల‌ను ధ్వంసం చేశార‌న్నారు. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తే చ‌ర్య‌లు తీసుకోక‌పోగా.. తిరిగి టీడీపీ నేత‌ల‌పైనే కేసులు పెట్టార‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement