Friday, April 19, 2024

ఏపీ డీజీపీ కి చంద్రబాబు లేఖ

ఏపీ డీజీపీ రాజేంద్రనాధ్ రెడ్డికి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో గత నాలుగు రోజుల్లో జరిగిన ఘటనలు, పెరుగుతున్న క్రైం రేట్ పై వివరాలతో చంద్రబాబు లేఖ రాశారు. నేరాలను అదుపు చెయ్యడంలో పోలీసుల వైఫల్యం, నిందితులపై కఠిన చర్యలు డిమాండ్ చేస్తూ లేఖ రాశారు. ఆయా అంశాలకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలు, ఇతర వీడియోలు చంద్ర‌బాబు లేఖకు జతచేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విచ్చిన్నం అయ్యిందన్నారు. జంగిల్ రాజ్ పాలనలో ప్రజలకు భద్రత కరువైందన్నారు. రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినేలా రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయన్నారు. పెట్రేగుతున్న వైసీపీ గూండాలను అదుపు చెయ్యడంలో పోలీసు శాఖ విఫలమైంద‌న్నారు. జి కొత్తపల్లిలో తన భర్త హత్యకు ఎమ్మెల్యే తలారి వెంకట్ రావు కారణమ‌ని స్వయంగా మృతుడు గంజి ప్రసాద్ భార్య చెప్పిందన్నారు. శ్రీకాళ హస్తిలో పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ వెయ్యడానికి వెళుతున్న వారిపై దాడిని నివారించడంలో పోలీసుల విఫలమ‌య్యారు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండి ఉంటే రేపల్లె రైల్వే స్టేషన్ లో దారుణం జరిగేది కాదన్నారు. రాష్ట్రంలో హింసకు, నేరాలకు విచ్చలవిడి మద్యం, గంజాయి వాడకం కారణమ‌వుతున్నాయన్నారు. గంజాయి సరఫరాలో వైసీపీ నేతల ప్రమేయం కనిపిస్తున్నా…. పోలీసు శాఖ తగు చర్యలు తీసుకోవడం లేదన్నారు.
అనంతపురంలో పెన్షన్ అడిగిన పాపానికి పోలీసు అధికారి టీడీపీ కార్యకర్తపై దాడి చెయ్యడం డిపార్ట్మెంట్ లో పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పట్టపగలు గన్ తో బెదిరించి అనకాపల్లి జిల్లా కసింకోటలో బ్యాంక్ దోపిడీ జరిగిందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఏపీ పోలీసులు స్పందించకున్నా….కర్నాటక పోలీసులు వైసీపీ ఎంపీటీసీ అరెస్టు చేశారన్నారు. తాజాగా ఏపీ నుంచి అస్ట్రేలియాకు డ్ర‌గ్స్ వెళ్లిన కేసులో దర్యాప్తు సంస్థలు ఒకరిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాయన్నారు. నేరాల్లో నిందుతులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు…లా అండ్ ఆర్డర్ అమలుపై పోలీసు శాఖ దృష్టిపెట్టాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement