Friday, April 26, 2024

ఏపీ డీజీపీకి చంద్రబాబు లేఖ

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు టీడీపీ అధినేత‌ చంద్రబాబు నాయుడు బ‌హిరంగ‌ లేఖ రాశారు. కర్నూల్ జిల్లా కోసిగి మండలంలో టీడీపీ నేత తిక్కారెడ్డిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల‌ని ఈ లేఖలో డిమాండ్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని తెలిపారు. క‌ర్నూల్ జిల్లా బొంపల్లె లో ఆలయానికి వెళ్లిన త‌మ పార్టీ నేత తిక్కారెడ్డిపై వైసీపీ కార్య‌క‌ర్త‌లు దారుణంగా దాడి చేశారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల దాడిలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. తిక్కారెడ్డికి తగిన భద్రత కల్పించాలని కోరారు.  రాష్ట్రంలో వైసీపీ దాడులపై న్యాయ విచారణ చేయించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం టీడీపీ నేత తిక్కారెడ్డిపై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. కోసిగి మండలం పెద్ద బొంపల్లి జాతరలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిక్కారెడ్డి వర్గీయులపై కొందరు వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడి చేశారు. అనంతరం ఇరువర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. వైసీపీ నేతల తనపై దాడికి యత్నించారని ఈ టీడీపీ నేత తిక్కారెడ్డి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement