Tuesday, April 23, 2024

ఏపీకి చంద్రబాబు కాదు బలిజ కులస్థుడే సీఎం

టీడీపీ అధినేత చంద్రబాబుపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ చింతా మోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాలేరని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక, వచ్చే ఎన్నికల్లో బలిజ కులస్థుడు సీఎం కాబోతున్నారని ఆయన జోష్యం చెప్పారు. నిజాయితీ, నిబద్ధత కలిగిన బలిజ నాయకుడు కోసం వెతుకుతున్నామని తెలిపారు.  రాష్ట్రంలో గత 75 ఏళ్లుగా రెడ్డి, కమ్మ కులస్తులే పరిపాలిస్తున్నారని చింతా మోహన్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement