Thursday, April 25, 2024

అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారు.. మంత్రి సీదిరి అప్పలరాజు

అధికారం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…వీధి రౌడీలు కూడా మాట్లాడనటువంటి మాటలను చంద్రబాబు జగన్ ను ఉద్దేశించి అంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగానే చంద్రబాబు కర్నూలులో పర్యటిస్తున్నారని విమర్శించారు. కర్నూలులో హైకోర్టు పెట్టేందుకు చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఆయనకు ఇష్టం లేదని ఆరోపించారు. అయితే చంద్రబాబు డ్రామాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement