Saturday, April 20, 2024

ఇవ్వాల కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్న చంద్రబాబు

కర్నూలు, (ప్రభ న్యూస్ బ్యూరో) : తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం గత అర్ధరాత్రి ఆయన కర్నూలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో చాగలమర్రి వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. కర్నూలు మౌర్య ఇన్ హోటల్ కు చేరుకుని రాత్రి అక్కడే బస చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు నందికోట్కూర్ రోడ్‌లోని కమ్మ సంఘం కళ్యాణమండపములో నిర్వహించే కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశములో పాల్గొనున్నారు.

ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది. అనంతరం నంద్యాల జిల్లా పరిధిలోని డోన్ నియోజకవర్గం, ప్యాపిలి మండలం, జలదుర్గం చేరుకుంటారు అక్కడ పార్టీ నిర్వహిస్తున్న బాదుడే , బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరిస్తూ.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. టీడీపీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు ఉమ్మడి జిల్లా పర్యటన సాగుతుందని టీడీపీ జిల్లా నాయకులు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement