Thursday, April 25, 2024

ఏపీలో కరోనా ఎన్ 440కె వైరస్: చంద్రబాబు

ఏపీలో అత్యంత ప్రమాదకర కరోనా వైరస్ ఎన్ 440కె ఏపీలో వ్యాపించిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తొలిసారిగా దీనిని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కర్నూలులో గుర్తించారన్నారు. ఇతర వైరస్‌ల కన్నా 10 రెట్లు ప్రభావం ఎక్కువ చూపుతుందని చంద్రబాబు తెలిపారు. జగన్ సర్కార్ మాత్రం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తోందన్నారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. వైద్య సిబ్బంది కొరతను తీర్చడానికి నియామకాలు చేపట్టాలన్నారు. బెడ్లు-ఆక్సిజన్ సరఫరా పెంచాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌ డౌన్‌ కు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇప్పటికే 14 రోజుల పాటు ఒరిస్సా లాక్‌ డౌన్‌ ను ప్రకటించిందని చంద్రబాబు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement