Thursday, April 25, 2024

కందుకూరు ఘటనకు చంద్రబాబే కారణం.. మంత్రి కాకాణి

కందుకూరులో నిన్న జరిగిన ఘటనకు చంద్రబాబే కారణమని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కందుకూరు ఘటనపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబు విచిత్ర ధోరణి, విపరీత ప్రవర్తనే ప్రమాదానికి కారణమన్నారు. ఇరుకు రోడ్లలో మీటింగ్ లు పెట్టి జనం ఎక్కువగా వస్తున్నారని ప్రచారం చేసుకోవడానికి, లేనిది ఉన్నట్లుగా చూపించుకోవడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్లాన్ ప్రకారమే ఇరుకు ప్రాంతాల్లో చంద్రబాబు సమావేశాలు చేస్తున్నారన్నారు. చంద్రబాబు వాహనం నిర్దేశించిన ప్రాంతం కంటే ముందుకు తీసుకొచ్చారన్నారు. చంద్రబాబు అధికార దాహం బయటపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement