Thursday, April 25, 2024

AP | బాబుకు అంత దైర్యం లేదు.. ప్రసన్న విమ‌ర్శ‌లు

విడవలూరు, (ప్రభ న్యూస్​): ఏ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ అధినేత చంద్రబాబు ఒంటరిగా పోటీ చేయ‌లేద‌ని, అంత‌ దమ్ము లేదని మాజీ మంత్రి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. ఇవ్వాల (శుక్రవారం) విడవలూరు మండలం ఊటుకూరు గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 53 సచివాల‌యాల పరిధిలోని 59, 041గడపలు తిరిగిన‌ట్టు చెప్పారు. సీఎం జగన్ మోహ‌న్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ ఫలాలు గురించి ప్రజలకు వివ‌రించాన‌న్నారు.

అదేవిదంగా.. ఆర్థిక రాష్ట్రంలో ఆర్థిక స‌మ‌స్య ఉన్నప్పటికీ సీఎం జగన్ ప్రజా సంక్షేమం కోసం ఎంతో కష్టపడి అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్నార‌ని ఎమ్మెల్యే ప్ర‌స‌న్న అన్నారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని, డబ్బుతో ఎమ్మెల్యే లను కొని.. ఒక ఎమ్మెల్సీని గెలుచుకోవడం చూస్తే ప్రజలు ఎద్దేవా చేస్తున్నారని మండిప‌డ్డారు. బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నిక‌ల్లో పోటీ చేసే బాబుకు ఈ సారి ప్రజలు తగిన గుణపాఠం చెబుతార‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక వైసిపి నాయకులు కోవూరు నియోజకవర్గం యువత పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement