కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మృతితో బద్వేలు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో బద్వేలు ఉప ఎన్నికలో పోటీ చేసే టీడీపీ అభ్యర్థిని పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఓబులాపురం రాజశేఖర్ బద్వేలు బరిలో దిగుతారని తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికకు సన్నద్ధం కావాలని రాజశేఖర్ కు చంద్రబాబు నిర్దేశించారు. గత ఎన్నికల్లో రాజశేఖర్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి ఎన్నికలలో ఓటమి చవిచూస్తున్న టిడిపికి గ్రూప్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement