Friday, April 19, 2024

వర్షాలపై అప్రమత్తంగా ఉండండి: ప్రజలకు చంద్రబాబు సూచన

గులాబ్ తుపాను ప్రభావంతో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ‘గులాబ్ తుపాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే తుపాను వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు, ప్రజలను తక్షణమే ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు వెంటనే చేపట్టాలి. తుపాను పీడిత ప్రాంతాల్లో ప్రజలకు ఏ సాయం కావాల్సి వచ్చినా అందించేందుకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండండి. సమస్యలపై ప్రభుత్వానికి వెంటనే సమాచారమిచ్చి అప్రమత్తం చేయండి’ అని చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు.   ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement