Wednesday, April 24, 2024

రోడ్డున ప‌డ్డ చ‌ల్లా కుటుంబ విబేధాలు..పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదులు..

నంద్యాల జిల్లా అవుకు మండలంలోనీ దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి నివాసం రణరంగంను తలపించింది. దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి భార్య జడ్పిటిసి శ్రీలక్ష్మిపై చల్లా రామకృష్ణారెడ్డి సోదరులు దాడి చేసినట్లు బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై చల్ల సోదరులతో పాటు మేనల్లుడు దుగ్గిరెడ్డి ,రవీందర్ రెడ్డి వారి కుటుంబీకులు దాడి చేసినట్లు శ్రీలక్ష్మి ఫిర్యాదు చేయడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement