Thursday, March 28, 2024

ఏపీ కరెంటు కష్టాలకు చెక్.. శ్రీకాకుళంలో 6 అణు విద్యుత్ రియాక్టర్లు

ఆంధ్రప్రదేశ్ కరెంటు కష్టాలు త్వరలో తీరనున్నాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. త్వరలో శ్రీకాకుళం జిల్లాలో 6 అణు విద్యుత్ రియాక్టర్లు ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖంగా ఉందని వెల్లడించారు. రాజ్యసభలో తాను అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సమాధానమిచ్చారని విజయసాయి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కటి 1,208 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం కలిగిన 6 రియాక్టర్లు ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రమంత్రి వివరించారని పేర్కొన్నారు. అయితే ఈ రియాక్టర్లు స్వదేశీవి కానప్పటికీ ఏపీలో విద్యుత్ డిమాండ్లను తప్పకుండా తీరుస్తాయని విజయసాయి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement