Thursday, April 18, 2024

Avinash: అవినాష్ రెడ్డికి మ‌రోసారి సీబీఐ నోటీసులు

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం (మే22)న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. కాగా శుక్రవారం (మే19) అవినాశ్‌ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు కూడా చేరుకున్నారు. అయితే చివరి నిమిషంలో తల్లికి ఆరోగ్యం సరిగా లేదని సీబీఐ విచారణకు హాజరుకాలేదు. అంతేకాదు వెంటనే కారులో పులివెందులకు బయలుదేరి వెళ్లిపోయారు.

అయితే తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ ఎదురుకావడంతో, అవినాశ్ రెడ్డి తన కాన్వాయ్ ని వెనక్కి తిప్పారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కర్నూలులో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం అవినాష్‌ కూడా కర్నూలులోనే ఉన్నారు. అయితే మరోసారి విచారణకు హాజరుకావాలంటూ వాట్సప్‌ ద్వారా అవినాష్‌ రెడ్డికి నోటీసులు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement