Thursday, April 25, 2024

జడ్జిలను దూషించిన కేసు.. ముగ్గురు లాయర్ల అరెస్ట్

జడ్జిలను దూషించిన కేసుపై సీబీఐ విచారణ వేగవంతం చేసింది. సోషల్ మీడియాలో జడ్జిలను దూషించిన ముగ్గురు లాయర్లను సీబీఐ అరెస్ట్ చేసింది. న్యాయవాది చంద్రశేఖర్, గోపాలకృష్ణతో పాటు మరో వ్యక్తిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో ముగ్గురిని అధికారులు విచారించారు. ముగ్గురు నిందితులను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ముగ్గురు నిందితులను విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement