Thursday, March 28, 2024

ఎంపీ రాఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజుకు షాక్ త‌గిలింది. పశ్చిమ గోదావ‌రి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేష‌న్ లో ఎంపీ రఘురామ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు అయింది. ఇటీవల సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను కులం పేరుతో ఎంపీ ర‌ఘురామ అసభ్య ప‌దాల‌తో దూషించాడ‌ని రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదు చేశారు.

కాగా, ఇటీవల సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లోని రఘురామరాజు ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో నమోదైన కేసుల్లో ఈ నెల 17న విచారణకు హాజరు కావాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement