Thursday, April 25, 2024

చీరాలలో కారు బీభత్సం

ప్రకాశం జిల్లా చీరాలలో ఓ కారు అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఫ్లైఓవర్ బిడ్జ్‎పై మూడు ద్విచక్ర వాహనాలు కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి అక్కడికక్కడే చెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి స్థానికులు తరలించారు. మృతుడు చీరాల మండలం ఈపూరుపాలేం విఆర్వో అశోక్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు ఘటానా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్దారించారు. కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement