Saturday, April 20, 2024

Accident | అనంత‌పురంలో యాక్సిడెంట్‌.. కారు ఢీకొట్టడంతో ఒకరు మృతి

యల్లనూరు (ప్రభన్యూస్): అనంత‌పురం జిల్లాలో యాక్సిడెంట్ జ‌రిగింది. సింగ‌న‌పురం నియోజ‌క‌వ‌ర్గం, య‌ల్ల‌నూరు మండలంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. గొడ్డుమర్రి మలుపు వద్ద బుధవారం ద్విచక్రవహనం, కారు ఢీకొన్న ఘటన లో ఒక‌రు చ‌నిపోయారు. గొడ్డుమర్రి గ్రామానికి చెందిన పాముల లక్ష్మీనారాయణ (72) పని నిమిత్తం తిమ్మాంపల్లి గ్రామానికి వెళుతుండగా.. అటు నుండి వస్తున్న కారు ఢీకొట్టింది. లక్ష్మీనారాయణ కింద ప‌డిపోయాడు. తీవ్ర గాయలపాలై అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ ఐ రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement