Saturday, April 20, 2024

జగన్ ప్రభుత్వంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లు .. చంద్రబాబు

జగన్ ప్రభుత్వంలో గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ లు వచ్చాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో టీడీపీ లీగల్ సెల్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు, అరెస్టులు, హత్యలు చేస్తున్నారన్నారు. జగన్ పాలనలో వేధింపులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. జగన్ ప్రభుత్వం గంజాయి పేరుతో అక్రమ కేసులు పెడుతోందన్నారు. వైసీపీ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ను పాటించడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం పోరాడుతామని చంద్రబాబు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement