Thursday, April 18, 2024

మంత్రి బుగ్గనను కలిసిన శాప్ చైర్మన్ బైరెడ్డి

కర్నూలు జిల్లా బేతంచర్లలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో జలవనరుల శాఖకు సంబంధించిన సమస్యలు, నందికొట్కూరు అభివృద్ధికి ప్రత్యేక నిధులు గురించి, మున్సిపాలిటీ సమస్యలను వివరించారు. నందికొట్కూరు అభివృద్ధికి నిధులను కేటాయించేందుకు సహకరించాలని కోరారు. కాగా, మంత్రిని కలిసిన వారిలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ తువ్వ శివరామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement