Thursday, April 25, 2024

చెన్నైకి బస్సు సర్వీసులు రద్దు..

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా తమిళనాడు రాష్ట్రంలో కర్ఫ్యూ విధించిన నేపథ్యంలో కర్నూల్‌ నుంచి వెళ్లే వివిధ సర్వీసులను రద్దు చేసినట్లు- రోడ్డు రవాణా శాఖ ప్రాంతీయ అధికారి వెంకటరామ తెలిపారు. కర్నూల్‌ నుంచి చెన్నైకి వెళ్లే 3 సర్వీసులు, నంద్యాల నుంచి చెన్నై వెళ్లే ఒక సర్వీసు, కర్నూల్‌ నుంచి నెల్లూరు వెళ్లే ఒక సర్వీసు, కర్నూల్‌ నుంచి తిరుపతి వెళ్లే రోడ్డు సర్వీసులు, ఆదోని నుంచి తిరుపతి వెళ్లే ఒక సర్వీసు రద్దు చేసినట్లు- తెలిపారు. బెంగళూరులో రాత్రి మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉండటం వల్ల బెంగళూరు సర్వీసులు యధావిధిగా నడపడం జరుగుతుందని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement