Thursday, April 25, 2024

Buddha Venkanna: రాధాని చంపేందుకు రెక్కీ.. బెజవాడలో మళ్లీ పాత రోజులు

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా చంపేందుకు రెక్కీ నిర్వహించిన పరిణామాలు ‌చూస్తే పాత బెజవాడ గుర్తొస్తుందని టీడీపీ ఎమ్మెల్యీ బుద్దా వెంకన్న అన్నారు. వంగవీటి రాధా ఎవరి జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటున్నారని చెప్పారు. తండ్రి ఆశయాల కోసం రాధా కృషి చేస్తున్నాడని తెలిపారు. వైసీపీ అరాచక పాలనలో అడ్డగోలుగా దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలన చూస్తుంటే బెజవాడలో మళ్లీ పాతరోజులు వస్తాయేమోనన్న ఆందోళన కలుగుతోందని పేర్కొన్నారు. గతంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి, రాధాపై రెక్కీకి లింకు ఉందని చెప్పారు. సైలెంట్ గా ఉండే రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో అందరికీ తెలుసని పేర్కొన్నారు. విజయవాడ నేతలతో పాటు వైసీపీ పెద్దల ప్రమేయం కూడా ఉందని బుద్ధా వెంకన్న ఆరోపించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement