Saturday, April 20, 2024

బీటెక్‌ విద్యార్థి దారుణ హత్య..

కావలి, (ప్రభన్యూస్‌): కావలి సమీపంలోని జాతీయ రహదారి పక్కన దారుణ హత్య జరిగింది. నిన్న సాయంత్రం తుమ్మలపెంట రోడ్డు జాతీయ రహదారికి సమీపంలో చెట్లలో కాల్చిన మృతదేహం ఉందని హైవే మొబైల్‌ వారు కావలి రూరల్‌ పోలీసులకు సమాచారం అందిచడంతో హుటాహుటిన కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్‌, రూరల్‌ సీఐ ఖాజావాలి,ఎస్సై వెంకటరావు, తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాని పరిశీలించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ప్రసాద్‌ మాట్లాడుతూ మృతుడి వద్ద సగం కాలిన సెల్‌ ఫోన్ ఆధారంగా యువకుడు దుత్తలూరు మండలం తురకపల్లి గ్రామానికి చెందిన కంచర్ల రాజేంద్రగా గుర్తించామన్నారు. యువకుడు కావలి విట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బిటెక్‌ మూడో సంవత్సరం చదువుతునట్లు ఆయన తెలిపారు.ఈ సంఘటనా పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement