Wednesday, March 27, 2024

Guntur | పల్నాడులో దారుణ హత్య.. వక్ఫ్ వివాదమే కారణమని అనుమానాలు

గుంటూరు, ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి : పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ కార్యకర్త షేక్ ఇబ్రహీం మంగళవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఇబ్రహీంతో కలిసి బైక్ పై వెళ్తున్న అలీకి తీవ్ర గాయాలయ్యాయి. బైక్ పై వెళుతున్న వారిరువురిపై దుండగులు కత్తులతో ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. సంఘటనలో ఇబ్రహీం అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన అలీని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

వక్ఫ్ భూములకు సంబందించిన వివాదం నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు. వక్ఫ్ భూముల ఆక్రమణలకు సంబంధించి ఇప్పటికే హై కోర్టులో వ్యాజ్యం నడుస్తోంది. దానిని ఉపసంహరించుకోవాలని కొంతకాలంగా తమకు బెదిరింపులు వస్తున్నట్టు బాధితుడు చెబుతున్నారు. సంఘటన జరిగిన పరిసర ప్రాంతాలలో సిసిటివి ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement