ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. చిత్తూరు జిల్లాకు వానగండం పట్టుకుంది. తిరుపతి సహా పలు పట్టణాలు, మండలాలు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. కాగా, చంద్రగిరి మండలం నారావారిపల్లిలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటిని వరద నీరు ముంచెత్తెంది.
ఇంటి వెనుకన పొలాలపై నుంచి వచ్చిన వరద ఇంటిని చుట్టుముట్టడంతో భద్రతా సిబ్బంది గదితో పాటు ఉద్యానవనం నీట మునిగింది. పంచాయతీ అధికారులు పట్టించుకోక పోవడంతో సర్పంచ్ లక్ష్మీ భర్త గిరినాయుడు, చంద్రబాబు సోదరుడు సుబ్రహ్మణ్యం నాయుడు నీటిని బయటకు పంపించే పనులు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..