Saturday, April 20, 2024

Breaking: ఆర్టీసీ బ‌స్సును ఢీకొట్టిన‌ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ప‌లువురికి గాయాలు

కేసరపల్లి-సవారిగూడెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘ‌ట‌న ఈరోజు జ‌రిగింది. విజయవాడ నుంచి గన్నవరం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు కేసరపల్లి ఊర్లోకి వెళ్ల‌డానికి టర్నింగ్ తిరుగుతుండగా గన్నవరం వైపు నుండీ విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో ఆర్టీసీ బస్సు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జయ్యింది. ప్రమాదంలో ఆర్టీసీ బస్సు కండక్టర్ కి తీవ్ర గాయాల‌య్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆస్ప‌త్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement