Thursday, March 28, 2024

Breaking: గుంటూరులో దారుణం.. రాళ్లు కర్రలతో టీడీపీ నేత‌పై దాడి.. ఇదిగో వీడియో..

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో దారుణం జ‌రిగింది. టీడీపీ కార్యకర్తను ప్రత్యర్థులు చిత‌క‌బాదిన ఘ‌ట‌న చోటుచేసుకుంది, వైసీపీ నేతలే దాడి చేశార‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా, పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువుకు చెందిన సైదాబిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సైదాబి తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై పెళ్లికి వెళ్లి వస్తుండగా దారిలో అడ్డగించి రాళ్లు, కర్రలతో దాడి చేసిన‌ట్టు తెలుస్తోంది. పొలానికి సంబంధించిన‌ దారి విషయంలో కావాలనే గొడవపడ్డార‌ని సైదాబి కుమారుడు జిలానీ చెబుతున్నాడు. కాగా, నరసరావుపేటలో ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో సైదాబి చికిత్స పొందుతున్నారు.

అయితే.. పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లెం టౌన్ షిప్ దగ్గర లోని గ్రీన్ ల్యాండ్ హోటల్ వద్ద ఈ గొడవ జరిగింది. తుమ్మలచెరువు టీడీపీ నాయకుడు షేక్ సైదాబీని కొందరు గుర్తుతెలియని వ్య‌క్తులు, యువకులు దాడి చేసినట్లు వీడియో వైర‌ల్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement