Tuesday, April 23, 2024

Breaking: ఆకాశం నుంచి కురిసిన‌ చేపలు.. ఎక్క‌డంటే..

నందలూరు, ప్ర‌భ న్యూస్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వాన‌ల‌కు జ‌నం ఇళ్ల నుంచి బ‌య‌టికి రావ‌డం లేదు. తుపాను తీరం దాటుతున్న టైమ్‌లో విప‌రీత‌మైన ఈదురుగాలులతోపాటు భారీ వ‌ర్షం దంచికొట్టింది. అయితే ఈ టైమ్‌లోనూ నందలూరు మండలంలో విచిత్ర‌మైన ఘ‌ట‌న జ‌రిగింది..

గురువారం రాత్రి సమయంలో క‌డ‌ప జిల్లా నంద‌లూరు బస్టాండ్ సెంట‌ర్ నుంచి నుంచి రాజంపేట వైపుగా కడప తిరుపతి హైవే రోడ్డుపై తిమ్మయ్య షాప్ సమీపంలో వర్షంలో చేప‌లు ప‌డ్డాయి.. దీంతో వర్షం భారీగా కురుస్తున్న చూడ్డానికి చుట్టుపక్కల ప్రజలు ఎగబడ్డారు. మండల వ్యాప్తంగా కూడా చేపలు పడ్డాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement